భారతదేశం యొక్క GDP (స్థూల దేశీయోత్పత్తి) గత పదేళ్లలో 105% వృద్ధి చెందింది, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలోనే అత్యధిక వృద్ధి రేటు.

దేశ జీడిపి (GDP) పదేళ్లలో 105% వృద్ధి... గత పది ఏళ్లలో భారతదేశ జిడిపి 105% మృతి చెందినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ సంస్థ వెల్లడించింది. 2015 లో 2.1 ట్రిలియన్ డాలర్లు ఉన్న బుద్ధి రేటు 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఇదే సమయంలో అమెరికా, చైనా, జర్మనీల జిడిపి వరుసగా 66%, 76%, 44% వృద్ధి చెందిందని తెలిపింది. భారతదేశం ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2027 నాటికి జర్మనీని అధికమిస్తుందని అంచనా.

ఐదుసార్లు నిబంధనలను అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచన... ఐదారుసార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేసేయోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాంటి వారి లైసెన్స్లను మళ్లీ పునరుద్ధరించాలని వారి పేరట వాహనాలు రిజిస్ట్రేషన్ కావని చెప్పారు. శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం స్పందించి ఈ వివరాలను వెల్లడించారు.

డీలిమిటేషన్ పై స్టాలిన్ ది వ్యూహమా? సెల్ఫ్ గోలా?... తమిళనాడులో బిజెపి ఏతర పార్టీలు డీలిమిటేషన్ పై సమావేశం కావడంపై చర్చ జరుగుతుంది. కొందరు ఈ ప్రక్రియను 25 ఏళ్లు వాయిదా వేయాలని ఇది అప్రజాస్వామికమని దక్షిణాది వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులు అవుతారని అన్నారు. అసలు కేంద్రం విధివిధానాలే నోటిఫై చేయకముందే ఆందోళన అనుభవం ఆనందించడం కరెక్టేనా? 25 ఏళ్లయ్యాక అమలు చేస్తే ప్రజాస్వామ్యం కిందకే వస్తుందా? స్టాలిన్ ది తమిళనాడు ఎన్నిక వ్యూహమా లేక తొందరపాటా అనే అంశంపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం నోటీసులు... పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుల్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22లోగా సమాధాన ఇవ్వాలని తొలిత ఆయనకు ఆదేశాలు ఇవ్వగా స్పందించలేదు. దీంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. కాగా పార్టీ ఫిరయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ కోరిన ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ సుప్రీమ్ ని ఆశ్రయించింది. ఈనెల 25న కేసులు ధర్మాసనం విచారించనుంది.

ప్రజలు కాదు పొలిటీషియన్ లే కులతత్వవాదులు: గడ్గరి... ప్రజలు కుల తత్వవాదులు కాదని కేంద్రమంత్రి నితిన్ గడ్గరి అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్ధ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడుతారని ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటు తనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనకబడి ఉన్నారనే పోటీ ఉందని గడ్కరి పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.

ఆ డబ్బు మాది కాదు జస్టిస్ వర్మ.... తనపై వస్తున్న ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఖండించారు. ఆ డబ్బు మాది కాదు ఆ స్టోర్ రూమ్ లో నేను నా కుటుంబ సభ్యులు ఎవరు డబ్బు దాచలేదు. అది మేముండే బిల్డింగ్ కాదు. ప్రక్కన అవుట్ హౌస్. దానికి మా ఇంటికి మధ్య గోడ ఉంటుంది. మీడియా మా పరువు తీసే కంటే ముందు కొంత విచారణ చేసి ఉంటే బాగుండేది. ఎవరైనా అలా సులభంగా దొరికేలా డబ్బులు దాచేస్తారా? అని కోర్టుకు వివరణ ఇచ్చారు.

కత్తెర పట్టుకుంటే ₹ లక్ష ఫీజు తీసుకుంటాడట...! హెయిర్ కట్ కు సెలూన్ షాప్ లో ఎంత తీసుకుంటారు? మధ్యతరగతి మనుషులు వెళ్లే సెలూన్ లో ₹ 200 లోపే ఉంటుంది. ఎంత లగ్జరీ సెలవు నాయనా ₹ 500-1000 మధ్యలో ఉంటుంది. కానీ ఆలీం హకీం అనే బార్బర్ మాత్రం హెయిర్ కట్ చేస్తే మినిమం ₹ లక్ష తీసుకుంటాడట. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రజిని, ధోని, కోహ్లీ ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్ మరి. ఒకప్పటి సాధారణ బార్బరే క్రమేపీ సెలబ్రిటీగా మారాడు.

బతికుండగానే శవయాత్ర... ఎక్కడంటే?... బతికుండగానే పాడ పై పడుకోబెట్టి ఊరేగింపు నిర్వహించే ఆచార్యం రాజస్థాన్లోని బిల్వాడాలో ఉంది. హోలీ పండుగ ముగిసిన వారం రోజులకు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారట. డోల్ అని పిలిచే ఈ ఊరేగింపు చిత్తూర్ గేట్ భవనం నుంచి ప్రారంభమై ఊరంతా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. గుడి వద్దకు రాగానే అతను పాడై నుంచి దూకి పారిపోతాడు. తర్వాత ఆ పాడెను ఆలయం గనుక దహనం చేస్తారట. 427 ఏళ్లుగా ఈ సాంప్రదాయం ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల బేకాతరు: పాకిస్థాన్లో ₹ 180 కు చేరిన కిలో చక్కెర ధర... ఒక కిలో చక్కెర ధర 164 మించ కూడదని ఉప ప్రధాని ఇషాక్ ధార్ హెచ్చరించినప్పటికీ పాకిస్తాన్లో చక్కెర ధరలు ₹180 కి చేరుకున్నాయి. కరాచీ హోల్సేల్ గ్రోసర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవూఫ్ ఇబ్రహీం మాట్లాడుతూ మిల్లర్లపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదని రీటైలర్ లను మాత్రమే మందలిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ ఈద్ పండుగలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ధరల పెరుగుదల మొదలైంది.

రోడ్డుపై వెళ్తుండగా సైకో కత్తితో పొడవడంతో మేడ్చల్లో ఆరేళ్ల చిన్నారి మృతి... మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్లర్లు రోడ్డుపై వెళ్తుండగా ఓ సైకో కత్తితో పొడవడంతో రియా అనే ఆరేళ్ల చిన్నారి చనిపోయింది. పోలీసుల ప్రకారం ఇన్ఫోసిస్ వద్ద పనిచేస్తున్న తోటి కూలీల వద్దకు వచ్చిన పశ్చిమ బెంగాల్ కు చెందిన 30 ఏళ్ల సైకో అప్లా హెమ్రూమ్ అటుగా వెళుతున్న బీహార్ కు చెందిన కూలీ కుమార్తె రియాను కత్తితో పొడిచాడు. అనంతరం హైదరాబాద్ వరంగల్ రహదారిపై వెళ్తున్న వారిపై రాళ్లతో దాడి చేశాడు.

ఆర్టీసీ బస్సు కారు ఢీకొని సూర్యాపేటలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి... సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బిబి గూడెం వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో కారులో ఉన్న గడ్డం రవీందర్, రేణుక, వారి కుమార్తె ఎనిమిదేళ్ల రితిక ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కంటాయపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో 11 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.

భార్యకు 380 కోట్లు భరణం ఇచ్చి.. తన కంటే 12 ఏళ్లు చిన్నదైన మహిళతో డేటింగ్ చేస్తున్నట్టు హృతిక్... హృతిక్ రోషన్ 14 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2014లో సుసాని ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నారు. హృతిక్ తన మాజీ భార్యకు ₹ 380 కోట్లు మరణం చెల్లించాడని ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన విడాకులలో ఒకటిగా నిలిచిందని నివేదికలు తెలిపాయి. 51 ఏళ్ల హృతిక్ ప్రస్తుతం తనకంటే 12 ఏళ్లు చిన్నదైనా సభ ఆజాద్ తో డేటింగ్ చేస్తుండడం గమనార్హం.